Pakistan: పాక్లో మరోసారి పేలుళ్లు.. 57 మంది మృతి
Pakistan: 50 మందికి తీవ్ర గాయాలు
Pakistan: పాకిస్తాన్ మళ్లీ రక్తసిక్తమైంది. బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఆత్మాహుతి దాడి జరిగింది. మిలాద్ ఉన్ నబి వేడుకలు టార్గెట్గా జరిగిన ఈ దాడిలో 57 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ మస్తుంగ్ జిల్లాలోని ఓ మసీదు దగ్గర మిలాద్ ఉన్ నబి వేడుకలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. 52 మంది స్పాట్లోనే చనిపోగా.. మరో 50 మంది తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ర్యాలీ పర్యవేక్షణ విధులు నిర్వర్తిస్తున్న డీఎస్పీ ప్రాణాలు కోల్పోయారు. ఆయన కారు దగ్గరే ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.