Pakistan Earthquake: పాకిస్థాన్లో భారీ భూకంపం..తీవ్రత 5.2గా నమోదు.. భయాందోళనల్లో ప్రజలు
Pakistan Earthquake: పాకిస్థాన్లో ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. మధ్య ప్రాంతంలో భూమి ఊగిపోవడంతో ప్రజలు నిద్రలేచి భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Pakistan Earthquake: పాకిస్థాన్లో భారీ భూకంపం..తీవ్రత 5.2గా నమోదు.. భయాందోళనల్లో ప్రజలు
Pakistan Earthquake: పాకిస్థాన్లో ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. మధ్య ప్రాంతంలో భూమి ఊగిపోవడంతో ప్రజలు నిద్రలేచి భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు అని అధికారులు తెలిపారు.
భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (NCS) ప్రకారం, ఉదయం 3:54 గంటల సమయంలో భూమి కంపించిందని పేర్కొన్నారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదు కాగా, భూకంప కేంద్రం 150 కిలోమీటర్ల లోతులో, 30.25°N అక్షాంశం, 69.82°E రేఖాంశం వద్ద ఉన్నట్లు వెల్లడించారు.
పాకిస్థాన్ భౌగోళికంగా భూకంపాలకు ప్రబలంగా గురయ్యే ప్రాంతంగా నిలిచింది. ఇది యూరేషియన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రదేశం కావటంతో, తరచూ ఇలాంటి ప్రకంపనలు చోటుచేసుకుంటాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా రాష్ట్రాలు యూరేషియన్ ప్లేట్పై ఉండగా, పంజాబ్, సింధ్ రాష్ట్రాలు ఇండియన్ ప్లేట్పై ఉన్నాయి.
ఈ కారణంగా పాకిస్థాన్ ప్రపంచంలో భూకంపాలు అత్యధికంగా నమోదయ్యే దేశాల్లో ఒకటిగా మారింది.