నేపాల్‌లో భూప్రకంపనలు...

నేపాల్‌లో మంగళవారం రాత్రి 5.3 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి.

Update: 2020-05-13 09:24 GMT

నేపాల్‌లో మంగళవారం రాత్రి 5.3 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. ఆ దేశ జాతీయ భూకంప కేంద్రం ప్రకారం, భూకంపం రాత్రి 11 గంటల 53 నిమిషాలకు సంభవించింది. దీని ప్రభావంతో ఖాట్మాండు, కాస్కీ, పర్సా, సింధుపల్‌చోక్‌ తదితరా ప్రాంతాల్లో భూకంపనాలు సంభవించాయని 'హిమాలయన్‌ టైమ్స్‌' పేర్కొంది.

డొలాకా జిల్లాలోని జుగు ప్రాంతంలో భూకంపన కేంద్రాన్ని గుర్థించినట్టు తెలుస్తోంది. అయితే భూకంపం ధాటికి ఎవరు గాయపడినట్టు గాని మరణించినట్టుగాని, ఆస్తి నష్టం సంభవించినట్టు గాని సమాచారం లేదు. మరోవైపు నేపాల్‌ సరిహద్దులోని భారత్‌ ప్రాంతంలో భూకంపనాలు సంభవించలేదని తెలుస్తోంది.


Tags:    

Similar News