అమెరికాలో మృత్యు మృదంగం.. ధ్రువీకరించని మరణాలు ఎక్కువే
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాడవం చేస్తుంది. వైరస్ దెబ్బకు అమెరికాలో ఇప్పటికే 22 వేలమందికిపైగా మృత్యువాత పడ్డారు.
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాడవం చేస్తుంది. వైరస్ దెబ్బకు అమెరికాలో ఇప్పటికే 22 వేలమందికిపైగా మృత్యువాత పడ్డారు. అయితే ఇది అధికారిక లెక్కలు మాత్రమేనని.. వాస్తవ మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా వ్యాప్తంగా నర్సింగ్ హోంలు, దీర్ఘకాలిక చికిత్సా కేంద్రాల్లో కరోనా సోకి ఇప్పటివరకు 3,600 మందికి పైగా మృతి చెందారని చెప్పారు. ఈ మృతుల సంఖ్యను గణాంకాల్లో అధికారులు కలిపి చూపించడం లేదని వెల్లడించారు.
తాజాగా అధికార వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించడం కలకలం సృష్టిస్తోంది. కాగా.. అక్కడ రెండు వారాల క్రితం వరకు నర్సింగ్ హోంలు, దీర్ఘకాలిక చికిత్సా కేంద్రాల్లో కరోనా దెబ్బకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 450 మాత్రమే ఉంది. ప్రస్తుతం అది 3,621కి పెరిగింది. దేశవ్యాప్తంగా ఈ కేంద్రాల్లో 10 లక్షల మందికిపైగా ఉంటున్నట్లు అంచనా. వారిలో ఎక్కువమంది వృద్ధులే. వైద్య సిబ్బంది కొరత, పర్యవేక్షణ లేమి వంటివి ఈ కేంద్రాల్లో వైరస్ వ్యాప్తికి ఊతమిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు.
ఇప్పటికే వర్జీనియాలోని రిచ్మాండ్లోని ఓ నర్సింగ్ హోంలో 42 మంది మహమ్మారి దెబ్బకు మృతిచెందారు. వైరస్ బారిన పడి 100 మందికిపైగా మరణించారు. సెంట్రల్ ఇండియానాలోని మరో నర్సింగ్ హోంలో 24 మంది మరణించారు. సియాటిల్లోని కిర్క్లాండ్లో ఉండే ఓ కేంద్రంలో 43 మంది ప్రాణాలను వైరస్ బలిగొంది. ఒక్క న్యూయార్క్లోనే ఇలాంటి కేంద్రాల్లో 1,880 మంది వరకు మృతిచెందారని తెలుస్తోంది.
ఈ కేంద్రాల్లో కొవిడ్ బాధితుల సంఖ్య మరింత ఎక్కువగా... ఉండే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. వాటిలో వ్యాధి నిర్ధారణ100 మందికిపైగా పరీక్షలను విస్తృతంగా చేపట్టాలని కోరుతున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ స్నేహితుడు న్యూయార్క్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజం స్టాన్లీ చెరా (70) కరోనా బారిన పడి మరణించారు. ట్రంప్ అధ్యక్ష ప్రచార కార్యక్రమాలకు చెరా దాతగా వ్యవహరించారు.