Indonesia: ఇండోనేషియాలో మళ్లీ పేలిన అగ్నిపర్వతం.. 23 మంది దుర్మరణం

Indonesia: సమత్రా దీవిలో బద్దలైన మౌంట్ మెరపి పర్వతం

Update: 2023-12-06 14:00 GMT

Indonesia: ఇండోనేషియాలో మళ్లీ పేలిన అగ్నిపర్వతం.. 23 మంది దుర్మరణం

Indonesia: పశ్చిమ ఇండోనేషియాలోని మౌంట్‌ మెరపి అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. ఆదివారం సంభవించిన దుర్ఘటన నుంచి స్థానికులు ఇంకా కోలుకోకముందే మరో విస్ఫోటనం చోటు చేసుకుంది. ఈ ఘటనల్లో మృతుల సంఖ్య 23కు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సుమత్రా దీవిలో ఉన్న మౌంట్‌ మెరపి పర్వతాన్ని అధిరోహించేందుకు మెుత్తం 75 మంది పర్వతారోహకులు బయలుదేరారు. ఆదివారం వీరంతా ట్రెక్కింగ్‌ చేసే సమయంలో అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలై 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయన విషయం తెలిసిందే.

Tags:    

Similar News