టీమిండియా నయావాల్‌ పూజారా

Update: 2019-01-07 07:46 GMT

టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పూజారా....సిడ్నీ టెస్టులో రికార్డుల మోత మోగించాడు. 2016 సీజన్ నుంచి టెస్ట్ క్రికెట్లో.. అత్యధిక బంతులు ఎదుర్కొన్న టెస్ట్ క్రికెటర్ గా సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఇండియన్ క్రికెట్ నయావాల్ గా తనపేరు సార్థకం చేసుకొన్నాడు. నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో మూడు సెంచరీలతో సహా 521 పరుగులు సాధించాడు చతేశ్వర్ పూజారా. టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియా జట్టులో కేవలం...వన్ డౌన్ స్థానం కోసమే పుట్టిన ఆటగాడు, చెక్కుచెదరని ఏకాగ్రత, పటిష్టమైన డిఫెన్స్ తో....క్రీజునే అంటిపెట్టుకొని గంటలతరబడి ఆడుతూ ....ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా......ప్రత్యర్థి బౌలింగ్ ఎటాక్‌కు.. అడ్డుగోడగా నిలబడగల ఏకైక ఆటగాడు. సౌరాష్ట్ర క్రికెట్ నుంచి భారత క్రికెట్లోకి దూసుకొచ్చిన పూజారా.....ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ తో....నయా వాల్ గా టెస్ట్ అరంగేట్రం చేశాడు. 2010 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో బెంగళూరు టెస్ట్ ద్వారా...తొలిమ్యాచ్ ఆడిన పూజారా...ఆ తర్వాత వెనుదిరిగి చూసింది లేదు.

ప్రస్తుత సిడ్నీ టెస్ట్ వరకూ...తన కెరియర్ లో ఆడిన 68 టెస్టుల్లో 18 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇందులో మూడు డబుల్ సెంచరీలు సైతం ఉండటం చూస్తే ...పూజారా ఏ రేంజ్ ఆటగాడో మరి చెప్పాల్సిన పనిలేదు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రస్తుత నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో...పూజారా టాప్ స్కోరర్ గా నిలిచాడు. అడిలైడ్, మెల్బోర్న్, సిడ్నీ టెస్టుల్లో సెంచరీలతో చెలరేగిపోయాడు. తన టెస్ట్ కెరియర్ లో ఏకంగా 3 డబుల్ సెంచరీలు సాధించిన పూజారా...ప్రస్తుత సిడ్నీటెస్టులో 193 పరుగులకు అవుటయ్యాడు. అంతేకాదు..2016 సీజన్ నుంచి ...ఆడిన 36 టెస్టుల్లో 6వేల 636 బాల్స్ ఎదుర్కొని...అత్యధిక బంతులు ఎదుర్కొన్న క్రికెటర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలోనే టీమిండియా క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్ పేరుతో ఉన్న 495 బాల్స్ రికార్డు ను పూజారా అధిగమించాడు. రాంచీ టెస్టులో.. అత్యధికంగా 525 బాల్స్ ఎదుర్కొనడం ద్వారా ద్రావిడ్ పేరుతో ఉన్న రికార్డును పూజారా అధిగమించాడు.

ఆసీస్ తో జరుగుతున్న ప్రస్తుత నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో..ఇప్పటి వరకూ ఆడిన ఏడు ఇన్నింగ్స్ లో పూజారా ఏకంగా 1258 బాల్స్ ఎదుర్కొని...ఇండియన్ క్రికెట్ నయావాలా...మజాకానా అనిపించుకొన్నాడు. ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా గతంలోనే రెండు రెండు డబుల్ సెంచరీలు సాధించిన మూడో క్రికెటర్ గా రికార్డుల్లో చేరిన పూజారా...ప్రస్తుత సిరీస్ లో ఏకంగా మూడు శతకాలు బాదడం మరో విశేషం .తాను ఎనిమిదేళ్ల వయసులోనే క్రికెట్ బ్యాట్ పట్టానని...తన తండ్రి శిక్షణలో సాధన చేయటంతో భయం అనేది లేకుండా పోయిందని...ఏకాగ్రత కూడా బాగా పెరిగిందని... పూజారా చెప్పాడు. బీసీసీఐ గత సీజన్ కాంట్రాక్టు వరకూ...A- గ్రేడ్ క్రికెటర్ గా ఏడాదికి 5 కోట్ల రూపాయలు అందుకొంటూ వచ్చిన పూజరా...ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్ లో అసాధారణంగా రాణించడం ద్వారా

A+ కాంట్రాక్టు అందుకొనే అవకాశాలు మెరుగుపరచుకొన్నాడు.

Similar News