Harish Rao: రెండు మూడు రోజుల్లో గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌.. త్వరలో 28 వేల ఉద్యోగాల భర్తీకి..

Harish Rao: త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు.

Update: 2022-09-01 11:04 GMT

Harish Rao: రెండు మూడు రోజుల్లో గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌.. త్వరలో 28 వేల ఉద్యోగాల భర్తీకి..

Harish Rao: త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. సంగారెడ్డి పట్టణంలో కొత్త పింఛనుదారులకు మంత్రి హరీశ్‌ రావు స్మార్టు కార్డులు పంపిణీ చేశారు. కేంద్ర సర్కార్‌ అన్నింటి ధరలు పెంచి పేదలపై భారం మోపిందన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.వెయ్యి దాటడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నారని వెల్లడించారు.

సొంత జాగాలో ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.3 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని దసరా పండుగకు ప్రారంభిస్తామన్నారు. రెండు మూడు రోజుల్లో గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌ వస్తుందని తెలిపారు. రాబోయే వారం రోజుల్లో 28 వేల ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి హరీశ్‌ రావు చెప్పారు.

Tags:    

Similar News