గ్రూప్-4 పోస్టుల నియామ‌క ప్ర‌క్రియ‌పై సీఎస్ స‌మీక్ష‌

Telangana Jobs 2022: తెలంగాణలో గ్రూప్-4 పోస్టుల నోటిఫికేషన్ జారీపై అధికారుల సమావేశం జరిగింది.

Update: 2022-05-19 10:36 GMT

గ్రూప్-4 పోస్టుల నియామ‌క ప్ర‌క్రియ‌పై సీఎస్ స‌మీక్ష‌

Telangana Jobs 2022: తెలంగాణలో గ్రూప్-4 పోస్టుల నోటిఫికేషన్ జారీపై అధికారుల సమావేశం జరిగింది. సీఎస్ సోమేశ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మెన్ జనార్దన్ రెడ్డి తో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రభుత్వం 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం పోస్టులు స్థానికులకే కేటాయించడం జరిగిందని, మిగిలిన ఐదు శాతం కూడా స్థానికులకే దక్కుతాయన్నారు సీఎస్.

ఇటీవల, గ్రూప్-I కింద 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియను ప్రారంభించింది. పోలీసు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కూడా కొనసాగుతుండగా, విద్యాశాఖకు టెట్ నిర్వహణకు క్లియరెన్స్ ఇచ్చినట్లు సీఎస్ తెలిపారు. గ్రూప్-4కు సంబంధించి రోస్టర్ పాయింట్ల వివరాలతో పాటు సంబంధిత సమాచారాన్ని ఈ నెల 29లోగా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అందజేయాలని సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. 

Full View


Tags:    

Similar News