తన ప్రేమను యువతి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. బ్లేడ్తో యువతి గొంతు కోసి.. ఆపై తానూ కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో సోమవారం రాత్రిజరిగింది. జడ్చర్ల మండలం బాదేపల్లికి చెందిన అనుదీప్ స్విట్స్ కళాశాలలో పాలిటెక్నిక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్కు చెందిన సౌమ్య(18) కూడా ఇదే కళాశాలలో చదువుతోంది ఇద్దరూ క్లాస్మేట్స్. ఈ క్రమంలో తనను ప్రేమించాలంటూ యువతిపై అనుదీప్ ఏడాదిగా ఒత్తిడి చేయగా.. ఆమె నిరాకరిస్తోంది. ఇటీవల వేధింపులు ఎక్కువ కావడంతో ఆ యువతి తన తల్లిదండ్రుల ఇంట్లో చెప్పింది. దాంతో వారు సౌమ్యను కళాశాల మాన్పించేశారు.
అయితే సౌమ్య తన ప్రేమను ఎంతకీ ఒప్పుకోవడం లేదన్న కారణంతో సోమవారం రాత్రి సౌమ్య ఇంట్లో చొరబడ్డాడు. ఈ క్రమంలో అనుదీప్ తన వెంట తీసుకొచ్చిన బ్లేడ్తో ఆమె గొంతు, తల భాగంలో కోశాడు. నొప్పికి తట్టుకోలేక కేకలు వేసింది. దీంతో స్థానికులు అనుదీప్ను బంధించారు. అయితే అనుదీప్ కుర్చీలపై దుస్తులు వేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటలు చెలరేగడంతో అతనికి గాయాలయ్యాయి. ఆపై అదే బ్లేడ్తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.