ఎట్టకేలకు భారత అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి బ్రిటన్కు పారిపోయిన విజయ్మాల్యాకు చుక్కెదురైంది. మాల్యాను భారత్కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది. దీనికి సంబంధించి బ్రిటన్ హోం మంత్రిత్వ శాఖ క్లియరెన్స్ కూడా ఇచ్చింది. మరోవైపు బ్రిటన్ మంత్రిత్వ శాఖ నిర్ణయంపై అక్కడ హైకోర్టుకు అప్పీలు చేసుకునేందుకు 14 రోజుల గడువును మాల్యాకు ఇచ్చింది. హైకోర్టు మాల్యా అప్పీల్ను తిరస్కరిస్తే ఆయన వెంటనే భారత్కు తిరిగి రావాల్సి ఉంటుంది. ఇంతకాలం భారత్కు తిరిగి వచ్చేందుకు నిరాకరిస్తూ కోర్టుల ద్వారా తప్పించుకున్న మాల్యాకు ఇది ఎదురుదెబ్బె అని చెప్పాలి. కాగా గతేడాది డిసెంబర్ నెలలో మాల్యాను భారత్కు అప్పగించాలని బ్రిటన్ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.