ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు

Update: 2019-04-09 15:10 GMT

నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెద్ద అడిశర్లపల్లి మండలం గణపురం గ్రామ సమీపంలోని ఏఎంఆర్‌పీ కాలువలో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకులు హైదరాబాద్‌కు చెందిన హరీశ్(22), సిద్దార్థ(21)గా గుర్తించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు చూసేందుకు వెళుతూ యువకులు మార్గమధ్యలో ఆగినపుడు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీంతో విహారయాత్ర కాస్త విషాద యాత్రగా ముగిసింది. విషయం తీసుకున్న తల్లిదండ్రులు బోరున విలపించారు. 

Similar News