రెండు లారీలు ఢీ..ఇద్దరు మృతి

విజయనగరం జిల్లాలోని గజపతినగరం మండలం గుడివాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు ఎదురేదురుగా ఢీకొనడంతో ఒక్కసారిగి మంటలు ఎగసిపడంతో మంటల్లో చిక్కుకుని డ్రైవర్, క్లీనర్ సజీవదహనమయ్యారు.

Update: 2019-08-22 02:06 GMT

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీ కొని మంటలు చెలరేగాయి. లారీ డ్రైవర్, క్లీనర్ లు సజీవదహానమయ్యారు. విశాఖపట్నం నుంచి మధ్య ప్రదేశ్ కు ప్లాస్టిక్ కెమికల్ తో వెళుతున్న లారీ ముందు వెళుతున్న లారీ ని ఢీ కొట్టింది. దీంతో కెమికల్ లోడ్ తో వెళుతున్న లారీలో భారీ మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని లారీ డ్రైవర్ రామ్ సుందర్, క్లీనర్ ఓం ప్రకాష్ సింగ్ లు మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదంలో రెండు లారీలు దగ్ధమయ్యాయి. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ రోడ్డు ప్రమాదం ఘటన గజపతి నగరం మండలం గుడివాడ జంక్షన్ వద్ద జరిగింది. 

Tags:    

Similar News