వికారాబాద్ జిల్లా పూడూరులో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొట్టాయి. దాంతో పెద్దఎత్తున మంటలు చెలరేగి రెండు కార్లూ తగలబడిపోయాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో కాళ్లు విరగడంతో నరకయాతనపడ్డారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్తో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.