ప్రముఖ టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో తన నివాసంలో ఝాన్సీ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. కొన్నాళ్లుగా తను ఓ వ్యక్తిని ప్రేమిస్తోంది. అతనితో సహజీవనం కూడా చేసినట్టు తెలిసింది. ఐతే.. ఈ విషయంలో తల్లిదండ్రులకు, ఝాన్సీకి మధ్య గొడవ జరిగింది. ప్రేమ కారణంగా కెరీర్ వదులుకుని, నటనకు దూరం అవడం విభేదాలకు కారణమైంది.
దీంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన ఝాన్సీ సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఝాన్సీ మా టీవీ ఛానెల్లో ప్రసారమయ్యే పవిత్రబంధం అనే సీరియల్లో నటిస్తున్నారు. అందులో నటనకుగాను మంచి ప్రశంసలు అందుకున్నారామె.