యువకుడిని దారుణంగా హతమార్చిన దుండగులు

Update: 2019-08-17 05:48 GMT

కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.. గుడివాడలోని దనియాల పేటలో భార్గవ్‌ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. కత్తులతో మెడ మీద దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి ఇంటి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. నిందితులను గుర్తించేందుకు క్లూస్‌ టీమ్‌, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన భార్గవ్‌ గతంలో ఓ హత్యకేసులో ప్రధాన ముద్దాయిగా పోలీసులు గుర్తించారు. ఈ ఉదంతంతో స్థానికులు హడలిపోయారు. 

Tags:    

Similar News