కామారెడ్డిలో దోపిడి దొంగల బీభత్సం

Update: 2019-07-25 01:15 GMT

కామారెడ్డిలోని విద్యుత్‌నగర్‌ కాలనీలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న నాలుగు ఇళ్లల్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. బుధవారం సాయంత్రం వరుస చోరీలకు పాల్పడ్డ దొంగలు 36 తులాల బంగారంతో పాటు 3 లక్షల నగదును దోచుకున్నారు. బాధితుల్లో ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఇల్లు కూడా ఉంది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్ టీమ్‌తో దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇది అంతర్‌ రాష్ట్ర ముఠా అనే అనుమానాలున్నాయని దొంగలను ఖచ్చితంగా పట్టుకుంటామని కామారెడ్డి అడిషనల్‌ ఎస్పీ ప్రకటించారు. 

Tags:    

Similar News