అమెరికాలో తెలుగు దంపతులు మృతిచెందారు. భర్త తన భార్యను తుపాకీతో కాల్చి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్కు చెందిన నకిరేకంటి శ్రీనివాస్(51), శాంతి(46)లు చాలా ఏళ్లుగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో టెల్ఫేయిర్ ప్రాంతంలో నివాసముంటున్నారు. వారు సోమవారం విగతజీవులుగా పడి ఉన్నారు. అయితే వారిద్దరినీ తుపాకీతో కాల్చడం వల్ల చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.
కొంతకాలంగా దంపతులిద్దరి మధ్య కలహాల చోటుచేసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కారణంగానే శ్రీనివాస్ తన భార్య శాంతిని తుపాకీతో కాల్చి చంపి ఉంటాడని, అనంతరం తాను కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కాగా వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనివాస్, శాంతి మధ్య గొడవ ఎందుకు జరిగిందన్న విషయమై ఎలాంటి సమాచారం లేదని, కేసును విచారిస్తున్నామని ఎఫ్బిఐ పోలీసులుపేర్కొన్నారు.