గుండెపోటుతో టీడీపీ మాజీ మంత్రి కన్నుమూత

Update: 2019-08-21 04:15 GMT

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పసుపులేటి బ్రాహ్మయ్య గుండెపోటుతో మృతిచెందారు. ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో తుదిశ్వాస విడిచారు. కడప జిల్లాకు చెందిన బ్రాహ్మయ్య రాజంపేట నియోజకవర్గం నుంచి 1994 ,99 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ ఎన్నికల ముందు కూడా బ్రహ్మయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాజంపేట పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన బ్రహ్మయ్యకు గుండెపోటు రావడంతో హాస్పిటల్‌కు తరలించారు. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందించారు. ఈ ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ సీటును ఆయన ఆశించి భంగపడ్డారు.  

Tags:    

Similar News