హేయిర్ కటింగ్ చేయించుకొమని తలిదండ్రుల మందలింపు... విద్యార్థి ఆత్మహత్య

Update: 2019-07-06 16:26 GMT

మహబూబ్‌నగర్ జిల్లాలోని బాదేపల్లి పట్టణంలో దారుణం చోటు చేసుకున్నది. తల్లిదండ్రులు మందలించారనే కోపంతో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళితే దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట మండలం నందిపేట్ గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి దంపతులు బాదేపల్లి పట్టణంలోని పద్మావతి కాలనీలో ఉంటున్నారు. ఈ దంపతుల కొడుకు నిఖిల్‌రెడ్డి(15) హైదరాబాద్‌లో భాష్యం స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. ఇటీవల హోం సిక్ సెలవులు ఇవ్వడంతో నిఖిల్ తన సగ్రామానికి వచ్చాడు. కాగా సోమవారం నుంచి పాఠశాలకు వెళ్లాల్సి ఉండటంతో హేయిర్ కటింగ్ చేపించుకోవాలని నిఖిల్‌కు తల్లిదండ్రులు సూచించారు.

అయినా చెప్పిన మాట వినకపోవడంతో తలిదండ్రుల నిఖిల్‌ని గట్టిగ మందలించారు. ఇక దీంతో తీవ్ర మనస్తాపనికి గురైన నిఖిల్ వెంటనే తన రూంలోకి వెళ్లి చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గదిలో నుంచి కొడుకు బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు భయంతో తలుపులు తెరిచి చూడగా ఉరేసుకొని కనిపించాడు. వెంటనే అతడిని కిందికి దింపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే నిఖిల్ రెడ్డి మృతి చెందాడు. దీంతో తలిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద చాయలు ఆలుముకున్నాయి.

Similar News