పదోన్నతి కల్పించే విషయంలో శ్రీకాకుళం జిల్లా పరిషత్ సీఈవో నగేశ్ వేధింస్తున్నారని ఆరోపిస్తూ జడ్పీ చైర్పర్సన్ ధనలక్ష్మీ పీఏగా పనిచేస్తున్న సంతోష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జడ్పీ చైర్మన్ మీడియా సమావేశం ఉందని మీడియాను పిలిపించి.. సహచర ఉద్యోగులు, మీడియా సిబ్బంది అడ్డుకుంటున్నా అందరిముందే పురుగుల మందు తాగుడు. దాంతో సంతోష్ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తులం సంతోష్ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. కుటుంబ గొడవల కారణంగా పోలీస్ కేసు ఉండటంతోనే సంతోష్ కు పదోన్నతి కల్పించలేదని తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.