జమ్ముకశ్మీర్లో ముగ్గురు ముష్కరులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టింది. రెండు రోజుల క్రితం బుడ్గాం జిల్లాలో షోపియాన్ జిల్లాలో జల్లెడపట్టారు. షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా ఎన్కౌంటర్ జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. దాడి జరిగిన ప్రాంతంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.. అయితే వీరిలో జమ్ము కశ్మీర్ పోలీసులు విభాగంలో పనిచేస్తున్న ఓ ఐపీఎస్ అధికారి సోదరుడు శాంసుల్ హక్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అతను వైద్యవిద్యను వదిలేసి ఇటీవల హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూప్లో చేరాడు. కాగా ఈ ఎన్కౌంటర్లో మృతిచెందింది హిజ్బుల్ ముజాహిదీన్సంస్థకు చెందిన ఉగ్రవాదులని తెలిపారు.