షర్మిలపై దుష్ప్రచారం కేసులో మొత్తం..

Update: 2019-01-18 03:18 GMT

ఏపీ ప్రతిపక్షనాయకుడు, వైసీపీ అధినేత, వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలపై సామాజిక మాధ్యమాల్లో కొంతకాలంగా దుష్ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు ఆమెపై అసభ్యంగా పోస్టులు పెడుతుండటంతో  పోలీసులకు ఫిర్యాదు చేశారు షర్మిల. దాంతో దర్యాప్తు వేగవంగం చేసిన తెలంగాణ పోలీసులు. షర్మిలపై సోషల్‌ మీడియా వేదికగా జరిగిన అసత్య ప్రచారాలకు సంబంధించి 12 వెబ్‌సైట్లను గుర్తించారు. ఐపీ అడ్రస్‌ల వివరాల ఆధారంగా కొందరు సర్వీస్‌ ప్రొవైడర్లతోపాటు సైట్ యజమానులకు నోటీసుల జారీ చేయనున్నారు. ఐపీ అడ్ర్‌సలు చేరడానికి మరో రెండు రోజుల సమయం పడతాయని పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి దుష్ప్రచారాలు ఎవరు చేసినా కఠిన శిక్షలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

Similar News