శంషాబాద్ SBIలో క్యాషియర్ చేతివాటం ప్రదర్శించాడు. ఏటీఎంలో డబ్బు పెడుతూ 17 లక్షల రూపాయలు కాజేశాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బ్యాంకు అధికారులు ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రాథమికంగా విచారణ జరిపిన పోలీసులు క్యాషియర్ మక్చూల్ బాషపై ఐపీసి 420, 409 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహరంపై స్పందించేందుకు బ్యాంక్ సిబ్బంది నిరాకరిస్తున్నారు. బ్యాంకులో ఎలాంటి అక్రమాలు జరగలేదంటూ చెబుతున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు.