పాత విద్యార్థినితో రాసలీలలు.. అడ్డంగా బుక్కైన ఉపాధ్యాయుడు

విద్యాసంస్థల్లోనూ ఆడపిల్లలపై లైంగిక వేధింపులు పాల్పడుతున్నారు కొందరు ఉపాధ్యాయులు .

Update: 2020-03-03 10:57 GMT
A photo that goes viral on social media

విద్యాసంస్థల్లోనూ ఆడపిల్లలపై లైంగిక వేధింపులు పాల్పడుతున్నారు కొందరు ఉపాధ్యాయులు . వారికి విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే మదమెక్కి కామంతో కళ్లు మూసుకుపోయి కామక్రీడలకు పాల్పడుతూన్నారు. కామవాంఛ తమ దగ్గర చదువుకుంటున్న విద్యార్థులను లోభరుచుకొని, విద్యార్థులపైనే కామం తీర్చుకునేందుకు పశువుల్లా మీద పడి పోతున్నారు.

ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినితో సాగించిన రాసలీలు సరదాగా మొబైల్‌ఫోన్‌లో చిత్రీకరిచండం అవి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన ఘటన మైసూరు జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆ ఉపాధ్యాయుని నీచత్వంపై జనం ఛీ కొడుతున్నారు. కర్ణాటకలోని మైసూరు జిల్లా నంజనగూడు సమీపంలోని రాంపుర గ్రామంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రాంపుర గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాడైన సిద్దరాజు అలియాస్‌ సిద్ధరామయ్య తన వద్ద చదువుకున్న పూర్వ విద్యార్థిని (20)ని మభ్యపెట్టి కామవాంఛలు తీర్చుకునేవాడు.

ఇక సిద్దరామయ్య చేసిన ఘనకార్యాన్ని ఫోటోలు తీసి వాటిని విద్యార్థిని వాట్సప్‌కు పంపించాడు. ఇక ఇక్కడే అసలు ట్వీస్ట్ మొదలైంది. విద్యార్థిని నెంబర్ కు పంపిన ఫోటోలు కాస్త మరో నంబర్‌కు వెళ్ళడంతో అతని రాసక్రీడల ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహంతో ప్రభుత్వ పాఠశాల ముందు ధర్నాకు దిగారు. సిద్దరాజు గ్రామం నుంచి పరారీ అయ్యాడు. సిద్దరాజు కొంతకాలంగా ధనుర్వాతంతో బాధపడుతున్నాడని, అప్పటి నుంచి యువతిని తరచూ ఇంటికి పిలుపించుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సిద్దరాజు అలియాస్‌ సిద్ధరామయ్యకు ఇప్పటికే రెండు పెళ్ళిళ్లు అయ్యాయని తెలిపారు. అమాయక విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న సిద్దరాజు అలియాస్‌ సిద్ధరామయ్యను అరెస్టు చేయాలని గ్రామస్తులు ధర్నా చేపట్టారు.

 

Tags:    

Similar News