ప్రియురాలు ఆత్మహత్య.. ప్రియుడి తండ్రి బలవన్మరణం

Update: 2019-01-18 02:15 GMT

వేర్వేరు కులాలు కావడమే వారికి శాపమైంది. ప్రేమించుకున్న యువతీయువకుడిని మందలించడంతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో మనస్థాపం చెందిన ప్రియుడు తండ్రి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన జయశంకర్ భూపాల పల్లి జిల్లా పాలంపేటలో జరిగింది. గ్రామానికి చెందిన సింధూజ, రమేష్‌ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వేర్వేరు కులాలు కావడంతో వారి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి చెందిన సింధూజ ఈ నెల 14న పురుగుల మందు ఆత్మహత్య చేసుకుంది. దీంతో అగ్రహించిన యువతి కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని రమేష్‌ ఇంటి ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో యువతి బంధువులు అసభ్య పదజాలంతో రమేష్‌ తండ్రిని దూషించారు. దాంతో ఆయన కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ప్రేమ రెండు కుటుంబాలలో విషాదం నింపింది. 

Similar News