నిజామాబాద్‌లో అర్ధరాత్రి దోపిడి దొంగల బీభత్సం : బంగారం షాపులే లక్ష్యం

Update: 2019-07-01 03:46 GMT

నిజామాబాద్‌లో దోపిడి దొంగల బీభత్సం సృష్టించారు. వరుస చోరీలతో హడలెత్తించారు. ఒక్కరాత్రే మూడు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. జ్యూయలరీ షాపులే టార్గెట్‌గా చోరీలు చేశారు. అర్ధరాత్రి దాటాక.. జరిగిన ఈ దోపిడీల్లో సుమారు 30 తులాల బంగారు ఆభరణాలతో పాటు.. నగదును కూడా ఎత్తుకెళ్లారు.

వినాయక్‌నగర్‌లో ఉన్న మూడు ఆభరణాల షాపుల్లో చోరీలకు పాల్పడ్డారు. అర్ధరాత్రి రెండు గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో చోరీలకు పాల్పడ్డారు. సాయితేజ, శ్రీ సాయిమహాలక్ష్మీ, చరణ్‌తేజ్‌ షాపుల్లో అందినకాడికి దోచుకున్నారు. షట్టర్‌ తాళాలు పగులగొట్టి.. సీసీ టీవీ కేబుల్స్‌ కట్‌ చేసి.. చోరీలకు పాల్పడ్డారు. అయితే ఓ షాపులో చోరీ చేస్తుండగా దృశ్యాలు రికార్డ్‌ అయ్యాయి. ఈ దొంగతనాలతో.. నిజామాబాద్‌ ఉలిక్కిపడింది. ఇటు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు.  

Tags:    

Similar News