తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Update: 2019-08-18 11:46 GMT

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ప్రత్తిపాడు మండలం ధర్మవరం జాతీయ రహదారిపై లారీని టాటా ఏస్‌ వాహనం ఢీ కొట్టింది. దీంతో మగ్గురు మృతి అక్కడిక్కడే మృతిచెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. బాధితులు తుని మండలంలోని తలుపులమ్మ దేవాలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నార్తు. 

Similar News