ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి!

Update: 2019-03-06 12:21 GMT

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి దేవరకొండ వెళుతున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టింది. టైర్ పేలిపోవడంతో అదుపుతప్పిన బొలెరో ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో బొలెరోలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు మరణించగా ఆర్టీసీ బస్సులోని 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొండమల్లేపల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే స్ధానిక పొలీసులు, రెవిన్యూ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .

Similar News