ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Update: 2019-01-02 02:52 GMT

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన త్రిపురాంతకం మండలం పోరెడ్డిపల్లి దగ్గర బుధవారం జరిగింది. లారీ- కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరికొంతమంది గాయపడ్డారు. క్షతగాత్రులను వినుకొండ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి 

Similar News