కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Update: 2019-01-06 14:56 GMT

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన బనగానపల్లెలోని యాగంటికి సమీపంలో జరిగింది. యాగంటికి చెందిన మోటరు బైక్‌ను తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దాంతో అక్కడిక్కడే ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు యువతులు, ఒక యువకుడున్నారు. వీరిని కర్నూలులో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బందిగా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన వీరిని ఆస్పత్రికి తరలించారు. యాగంటి ఆలయం నుంచి తిరిగి వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న మోటారు బైక్ ను ఢీ కొట్టినట్టు తెలుస్తోంది.

Similar News