దెందులూరులో రోడ్డు ప్రమాదం...15మందికి గాయాలు

Update: 2018-12-29 03:18 GMT

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దెందులూరుకు సమీపంలోని సత్యనారాయణపురంలో శనివారం ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఏలూరు ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్లు, క్లీనర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. లారీని బస్సు ఓవర్ టేక్ చేయబోతుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు శ్రీకాకుళం నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.దెందులూరులో రోడ్డు ప్రమాదం...15మందికి గాయాలుదెందులూరులో రోడ్డు ప్రమాదం...15మందికి గాయాలు 

Similar News