రంగారెడ్డి జిల్లాలో నిండు గర్భిణీ అనుమానాస్పద మృతి

Update: 2019-08-04 08:23 GMT

రంగారెడ్డి జిల్లాలో నిండు గర్భిణీ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె మృతదేహాం చెట్ల పొదల్లో పడి ఉంది. పోచమ్మగడ్డ తాండకు చెందిన ఇస్లావత్ సరితకు ఏడాదిక్రితం రాజుతో పెళ్లి జరిగింది. భార్యను భర్త అదనపు కట్నం వేధిస్తున్నాడు. నిన్నటి నుంచి భార్య కనిపించడంలేదు. ఇవాళ ఇబ్రహీంపట్నం మండలం చింతపల్లి గూడ గేట్ సమీపంలోని చెట్ల పొదల్లో ఆమె శవం పడి ఉంది. క్లూ టీమ్, డాగ్ స్కార్డ్ తో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసుల కేసు దర్యాప్తు చేస్తున్నారు. భార్యను తానే హత్య చేసినట్లు భర్త పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.   

Tags:    

Similar News