వీడిన కృష్ణా జిల్లా చల్లపల్లి స్టూడెంట్‌ మర్డర్ మిస్టరీ

Update: 2019-08-07 04:14 GMT

కృష్ణా జిల్లా చల్లపల్లిలో నిన్న జరిగిన మూడో తరగతి విద్యార్థి హత్య కేసును పోలీసులు చేధించారు. మూడో తరగతి చదువుతున్న దాసరి ఆదిత్యను హత్య చేసింది.. పదో తరగతి విద్యార్థి అని పోలీసులు గుర్తించారు. ఆదిత్య ఇతడిని దుర్భాషలాడటం వల్లే హత్య చేశాడని తేల్చారు. ఇద్దరి మధ్య సోమవారం ఒక సారి గొడవ జరిగింది. రాత్రి 9 గంటల సమయంలో కూడా విద్యార్థు ఇద్దరు తిట్టుకోవడంతో కాపలాదారు మందలించాడు. అయితే రాత్రి సమయంలో ఆదిత్యను బాత్రూం వద్దకు తీసుకువెళ్లి పదో తరగతి విద్యార్థి హత్య చేశాడు.  విధుల్లో అలసత్వం వహించిన హాస్టల్ కాపలాదారుడు, ఇన్ చార్జి సంక్షేమ అధికారిని సస్పెండ్ చేశారు.

Tags:    

Similar News