నిజామాబాద్‌లో కొనసాగుతున్న దొంగల బీభత్సం

Update: 2019-07-03 05:03 GMT

పోలీసులు స్పెషల్‌ యాక్షన్‌ తీసుకుంటున్నామని చెబుతున్నా.. నిజామాబాద్‌లో మాత్రం దొంగతనాలు ఆగడం లేదు. తాజాగా న్యాల్‌కల్‌ రోడ్డులో వృద్ధురాలిని అతికిరాతకంగా మత్య చేసి.. దొంగతనానికి పాల్పడ్డారు. యాసిడ్‌ పోసి హత్య చేసి.. ఒంటిపై ఉన్న నగలు, ఇంట్లో బీరువాలోని నగదును అపహరించారు. 75 ఏళ్ల సాయమ్మ అనే వృద్ధురాలిని యాసిడ్‌తో పాటు.. బ్లేడ్లతో గాయపర్చారు. 15 రోజులుగా తన కుమారుడి దగ్గరున్న సాయమ్మ.. నిన్న రాత్రి ఇంటికి వచ్చింది. అయితే ఆమె ఇంటికి చేర్చిన ఆటో డ్రైవర్‌పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటు రంగంలోకి దిగిన పోలీసులు.. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో దర్యాప్తు చేస్తున్నారు.  

Tags:    

Similar News