స్నేహితుడితో వీడియో కాలింగ్‌ మాట్లాడుతూనే విద్యార్ధిని ఆత్మహత్య

Update: 2019-09-04 02:39 GMT

స్నేహితుడితో వీడియో కాలింగ్‌ మాట్లాడుతూనే ఓ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో జరిగింది. తూర్పు గోదావరి జిల్లా గోకవరానికి చెందిన భాగ్యలక్ష్మి నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో సీఎస్పీ థర్డ్ ఇయర్ చదువుతోంది. అయితే ఎమోందో ఏమో రాత్రి ఆమె స్నేహితుడితో ఫోనులో మాట్లాడుతూ మాట్లాడుతూ రూములో ఉన్న ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. యువతి మృతికి ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. ఫోనులో మాట్లాడిన యువకుడిని పోలీసులు విచారిస్తున్నారు. 

Tags:    

Similar News