వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం; ఎన్‌ఐఏ చార్జిషీట్‌

Update: 2019-01-23 13:44 GMT

ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్ వేసింది. ఛార్జ్‌షీట్‌లో ఏ1 నిందితుడిగా శ్రీనివాస్‌ని పేర్కొంది. ఈ కేసులో విచారణ ఇంకా ఉందని ఎన్‌ఐఏ అధికారులు స్పష్టం చేశారు. చార్జిషీట్‌ కాపీని ఎవరికీ అందకుండా చూడాలని, గోప్యంగా ఉంచాలని కోర్టు సిబ్బందిని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆదేశించారు. కాగా శ్రీనివాస్ రాసుకున్న లేఖను కోర్టుకు ఎన్‌ఐఏ సమర్పించింది. ఇక ఈ నెల 25న ఛార్జ్‌షీట్‌లో ఏముందో తెలిసే అవకాశం ఉంది. ఇదిలావుంటే శ్రీనివాసరావు తరుపు లాయర్లు మాత్రం చార్జిషీట్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఈ కేసుపై పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా అత్యవసరంగా ఛార్జ్‌షీట్‌ ఎందుకు దాఖలు చేశారని వారు ప్రశ్నించారు. 

Similar News