ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో నవ దంపతులు దుర్మరణం

Update: 2019-05-02 02:59 GMT

మోటార్‌ సైకిల్‌ను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో నవదంపతులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వి. కోట మండలం జాతీయ రహదారిలోని తోటకనుమ క్రాస్‌ వద్ద జరిగింది. పలమనేరు మండలం విభూది ఎల్లాగరం గ్రామానికి చెందిన అశోక్‌(23), అతని భార్య అశ్విని (18) పలమనేరు నుంచి వి.కోట వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఎదురుగా వి.కోట నుంచి పెట్రోల్‌ ట్యాంకర్‌ వస్తోంది.

దీంతో అదుపుతప్పిన పెట్రోల్ టాంకర్ దంపతులు ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వారికి రెండు నెలల క్రితమే వివాహమైంది. వీరి మరణంతో రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించి దర్యాప్తు జరుపుతున్నారు. 

Similar News