ఏవోబీలో మావోయిస్టుల పంజా..

Update: 2019-05-11 12:31 GMT

ఏవోబీలో మావోయిస్టుల పంజా విసిరారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా మథిలి పీఎస్‌ పరిధి ఒరపదర్‌ అటవీ ప్రాంతంలో మందుపాతర పేల్చారు మావోయిస్టులు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు గాయపడ్డ జవాన్లను ప్రత్యేక హెలీకాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు.

కూంబింగ్‌కు వెళ్లి తిరిగి వస్తున్న జవాన్లే టార్గెట్‌గా మందు పాతర పేల్చారు మావోయిస్టులు. రెండు రోజుల కింద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మాజీ ఎమ్మెల్యే కిడారి హత్య సూత్రధారి స్వరూపతో పాటు.. మరో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. దీనికి ప్రతీకారంగానే మందుపాతర పేల్చినట్లు తెలుస్తోంది. 

Similar News