ఆరో తరగతి బాలికపై వీఆర్వో అత్యాచారయత్నం

నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నవీపేట మండలం యంచ గ్రామంలో ఆరో తరగతి బాలికపై వీఆర్వో రవి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.

Update: 2019-08-26 00:46 GMT

నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నవీపేట మండలం యంచ గ్రామంలో ఆరో తరగతి బాలికపై వీఆర్వో రవి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దోమకొండ వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న రవి ఎదురింట్లో బాలికను చెరదీసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్ళిన సమయంలో అఘాయిత్యానికి ఒడికట్టాడు. బాధితురాలు గట్టిగాకేకలు వేస్తూ పరుగులు పెట్టింది. కూతురిపై జరిగిన ఘటనను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరై విలపించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.  

Tags:    

Similar News