మరో పరువు హత్య వెలుగులోకి..

Update: 2018-12-30 04:01 GMT

ఇటీవల పరువుహత్యలు పెరిగిపోతున్నాయి. మిర్యాలగూడ, మంచిర్యాల ఘటనలు మరవకముందే మరో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. శనివారం హైదరాబాద్ నగరంలోని తిరుమలగిరిలో నందకిషోర్‌ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య భార్య తరపున బంధువులే చేశారని పోలీసులు భావిస్తున్నారు. నాలుగేళ్లకిందట తిరిమలగిరిలోని టీచర్స్‌ కాలనీకి చెందిన ఓ యువతిని నందకిషోర్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు.

అయితే ఇది ఇష్టం లేని యువతి తలిదండ్రులు.. అల్లుడిపై కక్ష పెంచుకున్నారు. నాలుగేళ్లుగా వీరిమధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దారుణంగా నందకిషోర్ ను కొట్టి చంపారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.మరో పరువు హత్య వెలుగులోకి..
 

 

Similar News