యువతి ఇంట్లో యువకుడు ఆత్మహత్య

Update: 2019-05-05 15:06 GMT

యువతి ఇంట్లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. కురబలకోట మండలం అంగళ్లు గ్రామానికి చెందిన శశి కుమార్, అదే గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. వీరి పెళ్ళికి ఇరుకుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. అంతేకాకుండా రెండు కుటుంబాలమధ్య గొడవలు కూడా జరిగాయి. పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినా ఫలితం లేకపోయింది.

ఈ క్రమంలో యువతి ఇంట్లో శశి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని.. యువతి కుటుంబసభ్యులే హత్య చేశారని ఆరోపిస్తున్నారు శశి కుమార్ తల్లిదండ్రులు. న్యాయం చేయాలంటూ వారు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Similar News