కర్నూలు జిల్లాలో యువకుడి హత్య

Update: 2019-05-16 07:18 GMT

కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. డోన్ మండలం మాల్యాలలో మనోహర్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని రైల్వే ట్రాక్ పై పడవేశారు. మృతుడు బేతంచర్ల నివాసిగా గుర్తించారు. మనోహర్ హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంత కాలంగా మనహోర్ ను ప్రేమిస్తున్న యువతి తరపు వారే హత్య చేసి ఉంటారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. మరో వైపు బైక్ పై వెళ్తుండగా పెళ్లి ప్రస్థావన రావడంతో బైక్ పై నుంచి తోసేసి ట్రైన్ కింద దూరటంతో మనోహర్ చనిపోయాడని ప్రియురాలు చెబుతోంది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Similar News