హైదరాబాద్ లో డెకాయిట్ ముఠాలు చెలరేగిపోయాయి. దారి దోపీడీలకు పాల్పడుతూ.. పోలీసులకే సవాల్ విసురుతున్న డెకాయిట్ గ్యాంగ్ ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ నెల 17న కాలాపత్తర్లో దారి దోపిడీకి పాల్పడింది ఈ ముఠానే. మధ్యప్రదేశ్కు దీపంజాయ్ బుందేలా హైదరాబాద్కి వచ్చి.. చర్లపల్లి జైలులో ఉన్న తన సోదరుడిని ములాఖత్ ద్వారా కలిశారు. అయితే అదే రోజు దొంగల ముఠా సభ్యులు కూడా జైల్లో ఉన్న ఆఫ్రోజ్ ఖాన్ను కలిశారు.
ఆ తర్వాత బుందేలా కదలికలను పసిగట్టిన ముఠా సభ్యులు సయ్యద్ యూనస్, సయ్యద్ అబద్దీన్లు తమను అతడికి పరిచయం చేసుకున్నారు. బుందేలా మధ్యప్రదేశ్కు వెళ్లేందుకు ఎయిర్పోర్ట్కి బయలు దేరగా.. నిందితులు తమ కారులో డ్రాప్ చేస్తామని నమ్మబలికారు. కారులో వెళ్తుండగా బుందేలాను కొట్టి నగదు, గోల్డ్ రింగ్ను దోచుకెళ్లరు. కాగా వీరిపై ఇప్పటికే పలు స్టేషన్లలో కేసులు నమోదైయ్యాయి. ఘటనను సీరియస్ గా తీసుకన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు.