జయరాం హత్యకు సూత్రదారి శిఖాచౌదరే : పద్మశ్రీ

Update: 2019-02-10 03:08 GMT

ప్రముఖ వ్యాపారవేత్త, కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరామ్‌ (55) దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. తెలంగాణ పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే పలువురిని విచారించిన పోలీసులు.. జయరాం భార్య పద్మశ్రీని బంజారాహిల్స్‌ ఏసీపీ కె.శ్రీనివాస్‌రావు మరోసారి విచారించారు. తన భర్త హత్యలో కుట్ర దాగి ఉందని ఆమె

పోలీసులకు వెల్లడించారు. ఈ హత్యలో ఆయన మేనకోడలు శిఖా చౌదరి కీలక సూత్రధారి అని, పద్మశ్రీ స్పష్టం చేశారు. అలాగే తన భర్త ఉమనైజర్‌ కాదని వెల్లడించినట్టు సమాచారం. కాగా పద్మశ్రీ నుంచి జయరామ్‌ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లను విచారణ కోసం పోలీసులు తీసుకున్నారు. పద్మశ్రీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. 

Similar News