వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. కన్న బిడ్డనే కడతేర్చిన తల్లి!

Update: 2019-12-23 07:44 GMT
కన్న బిడ్డనే కడతేర్చిన తల్లి

హైదరాబాద్‌ శివారులోని రాజేంద్రనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పేగు తెంచుకొని పుట్టిన కుమారుడిని కడతేర్చిందో కసాయి తల్లి. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో కొడుకునే చంపేసింది. ఏడో తరగతి చదువుతున్న బాలుడ్ని గొంతునులిమి హత్య చేసింది. ఈ ఘటనతో ఒక్కసారిగా కాలనీవాసులు షాక్‌కు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కన్న బిడ్డను తల్లే చంపడంపై కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు. ఆ కసాయి తల్లిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News