న్యూజిలాండ్ కాల్పుల్లో హైదరాబాద్ వాసి మృతి

Update: 2019-03-15 13:20 GMT

న్యూజిలాండ్ ఉగ్రదాడిలో హైదరాబాద్‌కి చెందిన ఇక్బాల్ జహంగీర్ అనే వ్యక్తి మరణించాడు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ధృవీకరించారు. ఈ విషయాన్ని MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక్బాల్ జహంగీర్ సోదరుడు అహ్మద్ జహంగీర్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడని అతడు న్యూజిలాండ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. అహ్మద్ జహంగీర్‌కు సాయం చేయాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ను విదేశాంగ శాఖ మంత్రి సుస్మాస్వరాజ్‌ను ఒవైసీ కోరారు. ఒవైసీ ట్వీట్‌కు వెంటనే స్పందిన కేటీఆర్‌ NRI డిపార్ట్‌మెంట్‌కు వెంటనే తెలియజేసి సాయం చేయాల్సిందిగా కోరుతానని తెలిపారు. 

Similar News