అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

Update: 2019-05-10 03:18 GMT

అనుమానం పెనుభూతమైంది. ఈ కారణంగా కట్టుకున్న భార్యను అతి దారుణంగా హతమార్చాడోవ్యక్తి ఈ ఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగింది. పాల్వంచలోని సీతారాంపట్నంకు చెందిన శివ తన భ్యార్యను నిత్యం అనుమానంతో వేధించేవాడు. ఈ క్రమంలో ఆ అనుమానం మరింత ఎక్కువైంది. దీంతో ఆమె మొహంపై అతికిరాతకంగా కర్రతో కొట్టి చంపాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఘటనపై విచారణ జరుపుతున్నారు. 

Similar News