వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ఐరాల మండలం నాగవాండ్లల్లె పంచాయతీ వీఎస్ అగ్రహారానికి చెందిన బావాజాన్కు రెండేళ్ల క్రితం పలమనేరుకు చెందిన జాస్మిన్(23)తో వివాహమైంది. వారికి ఇంకా సంతానం కలుగలేదు. అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి.
భర్త అత్తమామలు నిత్యం వేధిస్తుండటంతో.. మనస్తాపం చెందిన జాస్మిన్ శుక్రవారం రాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. అపస్మారకస్థితిలో పడివున్న జాష్మిన్ ను చూసి కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.