పోలీస్ స్టేషన్ ఎదుట జ్యోతి కుటుంబ సభ్యుల ఆందోళన

Update: 2019-02-13 14:09 GMT

గుంటూరు జిల్లా అమరావతికి సమీపంలో రెండు రోజుల కిందట ప్రేమ జంటపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.. ఈ దాడిలో ప్రేమజంట శ్రీనివాస రావు- జ్యోతి లు తీవ్రంగా గాయపడగా జ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్నారు. ఇక ఈ కేసును పోలీసులు సరిగా విచారించడం లేదంటూ మృతురాలి కుటుంబ సభ్యులు మంగళగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు.

శ్రీనివాసరావే తన కుమార్తెను హత్య చేయించాడని జ్యోతి తల్లి ఆరోపిస్తోంది. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆమె బంధువులతో కలిసి బైఠాయించింది. తమ బంధువులను విచారిస్తున్నారు కానీ తాము చెప్పిన వారిని విచారించడంలేదని జ్యోతి తల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా జ్యోతి ప్రియుడు చుంచు శ్రీనివాసరావు, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

Similar News