దూడను వధించినందుకు..గుజరాత్ కోర్టు సంచలన తీర్పు

Update: 2019-07-08 03:00 GMT

లేగదూడను వధించిన గుజరాత్ వ్యక్తి సలీమ్ మక్రానీకి కోర్టు పదేళ్ల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధించింది. గుజరాత్ యానిమల్ ప్రెజెర్వేషన్ (అమెండమెంట్) చట్టం, 2017 ప్రకారం రాజ్‌కోట్‌లోని అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి హెచ్‌కే దవే ఈ తీర్పు వెలువరించారు.

సలీంపై ఈ ఏడాది జనవరిలో కేసు నమోదైంది. ఓ లేగదూడను అపహరించి వధించాడన్న అభియోగాలు అతడిపై నమోదయ్యాయి. లేగదూడ మాంసాన్ని అతడి కుమార్తె వివాహంలో మక్రానీ వడ్డించాడు. ఈ కేసులో సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. అనంతరం పదేళ్ల జైలు శిక్షతోపాటు లక్షరూపాయల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది.

Tags:    

Similar News